తెలంగాణలో సంచలనం రేపిన సూర్యాపేట వైద్యకళాశాలలో ర్యాగింగ్ ఘటనలో ఆరుగురు విద్యార్థులపై కేసు నమోదైంది. మంత్రి హరీశ్రావు ఆదేశాలతో ఉన్నతాధికారులు.. పోలీసులు విచారణ చేపట్టారు. వసతి గృహంలో విచారణ చేపట్టిన డీఎస్పీ మోహన్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 మంది విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడిచారు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.
మరోవైపు సూర్యాపేట వైద్య కళాశాలలో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ ఘటనకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ర్యాగింగ్ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిటీ నివేదిక అందిన తర్వాత ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital