Monday, April 29, 2024

అనంత రోడ్డు ప్రమాదంపై ప్రధాని విచారం.. మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

అనంతపురం జిల్లా ఉరవకొండ బూదగవి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాడ సానుభూతి తెలిపారు.

కాగా, ఉరవకొండ మండలం నిమ్మగల్లు గ్రామస్తులు కర్ణాటక బళ్లారిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బయటకు తీయలేనంతగా మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన పొక్లెయిన్లు తెప్పించి మృత దేహాలను బయటకు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement