Friday, May 3, 2024

Rajya Sabha: క్యాసినో ప్ర‌స్తావ‌న తెచ్చిన టీడీపీ ఎంపీ : అడ్డుకున్న వైసీపీ ఎంపీలు

రాజ్య‌స‌భ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుందని ఆరోపించారు. డ్రగ్స్ కు అడ్డాగా ఏపీ మారిందని ఆరోపించారు. డ్రగ్స్ తో పాటు క్యాసినోలను కూడా ప్రభుత్వం నడిపిస్తుందని కనకమేడల ప్రస్తావించారు. గుడివాడలో జరిగిన క్యాసినోను ఆయన ఉదహరించారు. ప్రభుత్వం పోలీసుల సహకారంతో ఈ వ్యవహారాలను నడుతుపుతుందని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. అలాగే ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారన్నారు. పోలీసుల ముందే దాడులు జరిగినా పట్టించుకోవడం లేదన్నారు. అయితే కనకమేడల రవీంద్ర కుమార్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement