Wednesday, May 15, 2024

రూపం మారుస్తూ మహమ్మారి సవాళ్లు విసురుతోంది: ప్రధాని మోదీ..

కరోనా మహమ్మారితో ప్రజలు పడుతున్న బాధలు, ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచానికి కరోనా మహమ్మారి సవాళ్లు విసురుతోందని మోదీ అన్నారు. కనిపించని శత్రువుతో అందరం పోరాడుతున్నామని చెప్పారు. మన మనసులకు దగ్గరగా ఉండే ఎంతో మందిని మహమ్మారి బలి తీసుకుంది. ప్రతి ఒక్కరి ప్రధాన సేవకుడిగా.. అందరి బాధలనూ పంచుకుంటానని స్పష్టం చేశారు.. వారి ఆవేదనను నేనూ అనుభవిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. శుక్రవారం 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని జమ చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలిసారి బెంగాల్ రైతులూ పథకం ఫలాలు అందుకున్నారు.

మనకున్న వనరులను వీలైనంత మేర వాడుకోవడం కోసం అన్ని అడ్డంకులను తప్పిస్తున్నామని మోదీ చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి కరోనా టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా 18 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సినే రక్షణ కవచమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement