Friday, April 26, 2024

కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2 లక్షల పరిహారం

కామారెడ్డి రోడ్డు ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరిన విషయం తెలిసిందే. ఎల్లారెడ్డి పోలీసు స్టేషన్‌ పరిధిలోని హసన్‌పల్లి గేటు వద్ద ఆదివారం సాయంత్రం 25 మంది ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్‌ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు మరణించగా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరో ముగ్గురు మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement