Tuesday, April 23, 2024

video: పోతిరెడ్డిపాడు గేట్లలో చిక్కుకున్న చిరుతపులి

నీటి దప్పిక తీర్చుకునేందుకు వచ్చి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గేట్లులో చిరుత పులి చిక్కుకున్న ఘటన సోమవారం వెలుగుచూసింది. వేసవి క్రమంలో నల్లమల అడవిలోని జంతువులు నీటి దాహార్తి తీర్చుకునేందుకు మైదాన ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ చిరుతపులి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద మంచి నీళ్లు తాగేందుకు వచ్చి నీటిలో పడిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత ఈదుకుంటూ ప్రాజెక్టు గేట్లులో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రాజెక్టు ఏ ఈ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారుల సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement