Thursday, April 25, 2024

భవనంపై కుప్ప కూలిన విమానం.. ఎనిమిది మంది మృతి

ఓ భవనంపై విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పొయారు. ఈ ప్రమాదం కొలంబియా దేశంలోని రెండో అతిపెద్ద నగరం మెడెలిన్ లో చోటు చేసుకుంది. ఒలాయా హెర్రెరా విమానాశ్రయం నుంచి ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో బయలుదేరింది ఈ విమానం.. ఇంజిన్‌ వైఫల్యంతో ఓ భవనంపై కుప్పకూలినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement