Sunday, April 28, 2024

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్ లో ధర ఎంతంటే..

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు భగభగ మండిపోతున్నాయి. గత రెండు వారులుగా పెట్రో ధరలను చమరు సంస్థలు పెంచుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం లీటర్‌ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.61, డీజిల్‌ రూ.95.87కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.119.67, డీజిల్‌ రూ.103.92కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.118.59, డీజిల్‌ రూ.104.62కి పెరిగింది. గత 15 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది 13వ సారి.

కాగా, గత మార్చి 22 తర్వాత వరుసగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.11 వరకు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement