Monday, May 6, 2024

Big Breaking: బీజేపీ సభకు పర్మిషన్​ క్యాన్సిల్​.. అనుమతి ఇవ్వబోమన్న కాలేజీ ప్రిన్సిపల్​

బీజేపీ బహిరంగ సభకు అడ్డంకి వచ్చింది. ఎల్లుండి హనుమకొండలోని ఆర్ట్స్​ అండ్​ సైన్స్​ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు పర్మిషన్​ క్యాన్సిల్​ అయ్యింది. పోలీసుల నుంచి ఎట్లాంటి పర్మిషన్​ లేనందున ఈ సభ పర్మిషన్​ క్యాన్సిల్​ చేస్తున్నట్టు ప్రిన్సిపల్​ లెటర్​ ద్వారా తెలియజేశారు. తమకు ఇచ్చిన 5 లక్షల రూపాయలను వాపస్​ ఇస్తామని, సభకు కాలేజీ మైదానంలో పర్మిషన్​ ఇవ్వబోమన్నారు కాలేజీ ప్రిన్సిపల్​.

దీంతో బీజేపీ లీడర్లు డైలామాలో పడ్డారు. మరో వేదిక వేతుక్కునే పనిలో అక్కడి లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి జరగాల్సిన సభకు ఉన్నట్టుండి పర్మిషన్​ క్యాన్సిల్​ కావడం వెనకాల టీఆర్​ఎస్​ లీడర్ల హస్తం ఉన్నట్టు ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement