Friday, May 3, 2024

తెగిన పారాచూట్ తాడు..స‌ముద్రంలో ప‌డిన వ్య‌క్తి..త‌ర్వాత ఏం జ‌రిగింది..

గాల్లో ఎగ‌ర‌డం ఇష్ట‌మేగాని..ఇది ఎంతో సాహ‌సంతో కూడిన ప‌ని అని తెలిసినా కొంద‌రు ఆ స‌ర‌దాని ఎంజాయ్ చేస్తారు. అయితే గాల్లో ఉండ‌గా పారాచూట్ తాడు తెగితే ప‌రిస్థితి ఏంటీ..అదే జ‌రిగింది. గుజరాత్‌కు చెందిన అజిత్‌ కథడ్‌ (30), సరళా కథడ్‌ (31) దంపతులు హాలిడే ట్రిప్‌ కోసం దయూలోని నంగావ్‌ బీచ్‌కు వెళ్లారు. అక్కడ పారాసెయిలింగ్‌ చేయాలని ఆశపడ్డారు. నిర్వాహకులు పవర్‌ బోటు నుంచి వారిని పారాచూట్‌లో పైకెగిరేశారు. అయితే వారు పైకి వెళ్లిన కొద్దిసేపటికే పవర్‌ బోటుకు, పారాచూట్‌కు అనుసంధానంగా ఉన్న తాడు ఒక్కసారిగా తెగిపోయింది. వారు కొద్దిదూరం వెళ్లి సముద్రంలో పడిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. బోటులో ఉన్న అజిత్‌ కథడ్‌ సోదరుడు రాకేశ్‌ భయంతో అరవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటిలో దూకి వారిని రక్షించారు. లైఫ్‌ జాకెట్లు వేసుకోవడంతో వారు నీటిలో మునిగిపోలేదు. వారికి ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement