Monday, April 29, 2024

Bonalu : మ‌హంకాళి బోనాల‌లో ప‌ల‌హారం బండి ఊరేగింపు.. డ్యాన్స్‌లతో హుషారుతెచ్చిన మంత్రులు

ఆషాఢం బోనాల ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమాన్ వద్ద ఫలహారం బండిని మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అక్కడి నుండి సిటీ లైట్, బాటా మీదుగా మహంకాళి దేవాలయం వరకు చేరుకున్నది. ఫలహారం బండి ఊరేగింపు ముందు పోతురాజులు, వివిధ వేష‌ధారణలతో కళాకారులు ప్రదర్శనలు, నృత్యాలు అల‌రించాయి. పుణే నుండి వచ్చిన బాంబే బ్యాండ్ బృందం డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫలహారం బండి ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్ల‌య్‌ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement