Sunday, April 28, 2024

పాకిస్థాన్ లో పైశాచికం .. న‌లుగురు మ‌హిళ‌ల దుస్తులు విప్పి దాడి .. ఐదుగురు అరెస్ట్ ..

తాలిబ‌న్లే కాదు పాకిస్థాన్ లో కూడా మ‌హిళ‌ల‌ప‌ట్ల వివ‌క్ష నెల‌కొని ఉంది. కాగా పాకిస్థాన్ లో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. న‌లుగురు మ‌హిళ‌ల్ని అతి దారుణంగా కొట్టారు. అంత‌టితో ఆగ‌ని వారి పైచాచికం వారి దుస్తుల‌ను విప్పారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మ‌హిళ‌ల్లో ఓ టీనేజ్ యువ‌తి ఉంది. పంజాబ్ ప్రావిన్సులోని ఫైస‌లాబాద్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో పంజాబ్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఫైస‌లాబాద్‌లోని బాబా చౌక్ మార్కెట్‌లో ఓ షాపులోకి ఎంట‌ర్ అయిన ఈ న‌లుగురు మ‌హిళ‌ల్ని ఆ షాపు ఓన‌ర్ చిత‌క‌బాదారు. వ‌స్తువులు దొంగ‌లించేందుకు వ‌చ్చిన‌ట్లు అనుమానించిన షాపు యాజ‌మాని మ‌రికొంత మందితో క‌లిసి ఆ మ‌హిళ‌ల‌పై దాడి చేశారు. క‌ర్ర‌ల‌తో కొట్టారు. బ‌ట్ట‌లు ఊడ‌దీసి మ‌రీ చిత‌క‌బాదారు. సుమారు గంట పాటు మార్కెట్ వీధిలో న‌గ్నంగా ఊరేగించారు. శ‌రీరంపై క‌ప్పుకోవ‌డానికి బ‌ట్ట‌లు ఇవ్వండి అంటూ ఆ మ‌హిళ‌లు వేడుకున్నా.. ఏమాత్రం క‌నిక‌రం చూడ‌కుండా కొట్టారు. ఈ ఘ‌ట‌న‌ని చూస్తున్నారే త‌ప్ప ఎవ్వ‌రూ ఆపే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement