Sunday, May 19, 2024

మ‌న కిన్నెర మొగుల‌య్య‌కు ప‌ద్మ‌శ్రీ.. వేడుక‌గా ప‌ద్మ అవార్డుల ప్ర‌దానోత్స‌వం

తెలంగాణకు చెందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇవ్వాల సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో వేడుక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా ప‌ద్మ‌శ్రీ అవార్డుకు ఎంపికైన మొగుల‌య్య కూడా రాష్ట్రప‌తి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ఏపీకి చెందిన గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు కూడా ప‌ద్మ‌శ్రీ అవార్డును రాష్ట్రప‌తి చేతుల మీదుగా అందుకున్నారు. ప‌ద్మ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో భాగంగా ప‌ద్మ భూష‌ణ్ అవార్డును క‌రోనా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసిన సీరం అధినేత పూనావాలా అందుకున్నారు. అదే విధంగా ఇటీవ‌లే హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావ‌త్‌కు ద‌క్కిన ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును ఆయ‌న కుమార్తెలు అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement