Sunday, May 5, 2024

Nigeria: చమురుశుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు.. 100 మందికిపైగా మృతి

నైజీరియాలోని ఓ చమురుశుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ నైజీరియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించిన తరువాత చాలా మంది సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన అనేక మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి.

ముడిచమురు శుద్ధికేంద్రం వద్ద తొలుత ప్రారంభమైన మంటలు ఆ తర్వాత సమీపంలోని రెండు చమురు నిల్వ ప్రాంతాలకు విస్తరించినట్టు అధికారులు తెలిపారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను ఇంకా లెక్కిస్తున్నట్టు అధికారులు తెలిపారు.  నైజీరియాలో ఉద్యోగాలు దొరక్క యువత చమురుశుద్ధి కేంద్రాలను అక్రమంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, అవసరమైన జాగ్రతలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement