Monday, May 6, 2024

గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ పై సస్పెన్షన్ వేటు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ పై సస్పెన్షన్ వేటు పడింది. శనివారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గణపురం మండల కేంద్రానికి చెందిన పెండ్యాల ప్రశాంత్ యువకుడు ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ప్రశాంత్ తల్లిదండ్రులు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డికి గత వారం ఫిర్యాదు చేయగా శనివారం ప్రశాంత్ చికిత్స పొందుతూ హనుమకొండ ఆస్పత్రిలో మృతి చెందాడు. అతని తల్లిదండ్రులు తమ కుమారుడి మృతికి ఎస్సైతో పాటు మరో వ్యక్తి కారణమని లిఖితపూర్వకంగా ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన ఉన్నతాధికారులు శనివారం రాత్రి ఎస్ఐ ఉదయ్ కిరణ్ ను సస్పెండ్ చేస్తూ నార్త్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టీఎస్  నుండి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement