Tuesday, April 30, 2024

ఓటీటీలో బిగ్ బాస్ – కంటెస్టెంట్స్ వీరేన‌ట‌

తెలుగులో బిగ్ బాస్5 సీజ‌న్ ముగిసింది. కాగా ఇప్పుడు బిగ్ బాస్ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీలో రానుంది. ఫిబ్ర‌వ‌రి 20నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజ‌న్ లో ఎవ‌రు పాల్గొన‌నున్నారో అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. ఈ మేర‌కు ప‌లు వార్త‌లు లీక్ అవుతున్నాయి కూడా. కాగా గ‌తంలో బిగ్‌బాస్‌లో అల‌రించిన వారిని కూడా ఈ సారి మ‌ళ్లీ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే మాజీ కంటెస్టెంట్లను తీసుకున్నారట‌. వారిలో అరియానా గ్లోరీ కూడా ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఆమెతో బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఒప్పందం చేసుకున్నార‌ట‌. ఆమెతో పాటు మాజీ కంటెస్టెంట్స్‌ ఆదర్శ్, తనీశ్‌, అఖిల్, అలీ రెజా, హరితేజను కూడా ఈ సారి బిగ్‌బాస్‌లోకి తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. కొత్త‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న వారిలో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, ఢీ-10 విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష కూడా ఈ సారి బిగ్‌బాస్‌లో అల‌రించనున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement