Saturday, April 20, 2024

కరీంనగర్ కారు ప్రమాదంపై వినోద్ దిగ్భ్రాంతి

కరీంనగర్ లోని కమాన్ వద్ద కారు ప్రమాదం ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, పోలీసు అధికారులతో వినోద్ కుమార్ మాట్లాడారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement