Saturday, May 4, 2024

ఉస్మానియా ఆసుప‌త్రిలో సీటీస్కాన్ ,క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి హ‌రీశ్ రావు

ఉస్మానియా హాస్ప‌ట‌ల్ లో సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించారు వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు. కాగా క్యాథ్ ల్యాబ్ ను రూ.8కోట్ల‌తో ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా అగ్నిమాప‌క యంత్రం, ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు. ఓపీ స్లిప్పుల జారీ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఇటీవ‌లే గాంధీ ఆస్ప‌త్రిలో సీటీ స్కాన్‌ను మంత్రి ప్రారంభించారు. నిలోఫ‌ర్ హాస్పిట‌ల్‌లో రూ. 2 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, నియోనాట‌ల్ స్కిల్ ల్యాబ్‌ను మంత్రి హ‌రీశ్‌రావు సోమ‌వారం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement