Sunday, May 5, 2024

సీఎం ‘యోగి ఆదిత్య‌నాథ్’ రికార్డ్ సృష్టించ‌నున్నారా – ‘టైమ్స్ నౌ స‌ర్వే’ ఏం చెబుతోంది

టైమ్స్ నౌ నిర్వ‌హించిన ఒపీనియ‌న్ పోల్ స‌ర్వేలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో బిజెపి అత్య‌ధిక‌స్థానాలు గెలుచుకుంటుంద‌ని పోల్ స‌ర్వేలో వెల్ల‌డైయింది. 403స్థానాల‌కు బిజెపి ఆధ్వ‌ర్యంలోని కూట‌మి 230నుంచి 249చోట్ల విజ‌యం సాధిస్తుంద‌ని అంచ‌నా వేసింది. 2017ఎన్నిక‌ల్లో బిజెపికి 325స్థానాల్లో విజ‌యం ద‌క్కింది. బీజేపీకి గట్టి పోటీనిస్తున్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి బాగానే పుంజుకోనుంది. ప్రస్తుత సభలో 48 స్థానాలుండగా.. 137 నుంచి 152 స్థానాల్లో విజయం సాధించొచ్చని టైమ్స్ నౌ పోల్ వెల్ల‌డించింది. మాయావతి ఆధర్యంలోని బీఎస్పీ మరింత బలహీనపడనుంది. 9-14 స్థానాలతో సరిపెట్టుకుంటుందని ఈ సర్వే వివ‌రించింది.

గత ఎన్నికల్లో బీఎస్పీ 19 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ 4-7 స్థానాల వద్ద ఆగిపోతుందని అంచనా వేసింది.బీజేపీ కూటమికి 38.6 శాతం ఓట్లు లభించనున్నాయి. ఎస్పీ కూటమికి 34.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా. బీఎస్పీ ఓటు బ్యాంకును ఈ రెండు కూటములు కొల్లగొట్టనున్నాయి. బీఎస్పీ ఓటు బ్యాంకు గతంలో 22.2 శాతంగా ఉండగా అది 14.1 శాతానికి క్షీణించనుంది. కాగా బిజెపి గెలిస్తే ప్ర‌స్తుత సీఎం యోగిఆదిత్య‌నాథ్ 36ఏళ్ల త‌ర్వాత యూపీ చ‌రిత్ర‌లో రికార్డు సృష్టింబోతున్నారు. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపడితే.. 1985 తర్వాత వరుసగా రెండు పర్యాయాలు సీఎం అయిన వ్యక్తిగా ఆయన పేరిట రికార్డు నమోదు కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement