Monday, May 6, 2024

Breaking: ఒంటేరు ప్రతాప్ రెడ్డి వాహ‌నం ఢీకొని .. ఒక‌రు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జ‌రిగింది. రాష్ట్ర అటవీ శాఖ‌ అభివృద్ధి చైర్మన్, BRS లీడర్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి కొంపల్లి తన ఇంటి నుండి తూప్రాన్ వెళ్తుండ‌గా మేడ్చల్ అత్వెల్లి వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ప్ర‌మాద స‌మ‌యంలో ప్ర‌తాప్ రెడ్డి వాహనం లోనే ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement