Thursday, May 16, 2024

మా నాన్న గెలిచేంత వ‌ర‌కు – పెళ్ళి చేసుకోను – స్ప‌ష్టం చేసిన సిద్ధూ కుమారై

త‌న తండ్రి పీసీసీ చీఫ్ న‌వ్ జ్యోత్ సింగ్ సిద్ధూ గెలిచేంత వ‌ర‌కు తాను పెళ్లి చేసుకోన‌ని స్ప‌ష్టం చేసింది ఆయ‌న కుమారై ర‌బియా. త‌న తండ్రి సిద్ధూ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ కోసం 14సంవ‌త్స‌రాల నుంచి క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ..పంజాబ్ ను ఆద‌ర్శ‌ప్రాయంగా తీర్చిదిద్ద‌డంకోసం ఎంతో కృషి చేశార‌ని ఆమె తెలిపింది. సీఎం చ‌ర‌ణ్ జిత్ చ‌న్నీ, పీసీసీ చీఫ్ న‌వ్ జ్యోత్ సింగ్ సిద్ధూల మ‌ధ్య ఉన్న విభేదాలు తెలిసిందే. పంజాబ్ సీఎం అభ్యర్థి చన్నీ అవినీతిపరుడని పరోక్ష వ్యాఖ్యలు చేసింది ర‌బియా. చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే, ఇవాళ అతడి బ్యాంకు ఖాతాలో రూ.133 కోట్లు ఎలా వచ్చాయని రబియా ప్రశ్నించారు. ఆయన ఖాతాను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి భారీ విజయం సాధించడం తథ్యమని చెప్పింది.కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఒత్తిళ్ల కారణంగా చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటుందని, కానీ నిజాయతీ పరుడైన వ్యక్తి (సిద్ధూ)ని ఎంతోకాలం అడ్డుకోలేరని రబియా వ్యాఖ్యానించారు. ఆమె తండ్రికి మద్దతుగా అమృత్ సర్ (తూర్పు) నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. ర‌బియా చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement