Monday, April 29, 2024

Farrukhabad jail: జైలులో అలజడి.. పోలీసులపై ఖైదీల దాడి

ఉత్తర్​ప్రదేశ్​ ఫరూఖాబాద్​ జైలులో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోటి ఖైదీ మరణించిన వార్త విన్న ఖైదీలు ఆవేశంతో జైలు సిబ్బందిపై దాడి చేసి జైలుకు నిప్పుపెట్టారు. జైలులోని పోలీసు సిబ్బందిపై ఖైదీలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 30మంది పోలీసులు, ఆరుగురు ఖైదీలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో డిప్యూటీ జైలర్​ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జైలులో పరిస్థితిని అదుపు చేసినట్టు చెప్పారు.

డెంగీ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురైన సందీప్ అనే ఖైదీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త జైల్లో ఉన్న మిగితా ఖైదీలకు ఆవేశంతో జైలు వింధ్వంసం సృష్టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement