Monday, April 29, 2024

నిత్యానంద‌స్వామిని పెళ్లి చేసుకుంటా-హీరోయిన్ ప్రియా ఆనంద్

తాను నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది హీరోయిన్ ప్రియా ఆనంద్. ఆయన గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా, ఆయనకు వేలాది మంది భక్తులున్నారని, ఆయన్ని ఆరాధిస్తారని చెప్పింది. ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఇంటిపేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు సరదాగా చెప్పినా, వివాదాస్పద స్వామిని పెళ్లి చేసుకోవాలనుకోవడం వైరల్‌గా మారింది. నిత్యానంద స్వామి ఎంతో పాపులర్‌ అయ్యారు. ఆయనకు లక్షల్లో భక్తులున్నారు. కానీ తన ఆశ్రమంలో అమ్మాయిలతో రాసలీలల్లో పాల్గొని కెమెరాలకు దొరికిపోయారు.

దీంతో రాసలీలల స్వామిగా ఫేమస్‌ అయ్యారు. అనేక లైంగిక ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. దీంతో పలు కేసుల్లో నిత్యానంద స్వామి ఇరుక్కున్నారు. ఈ కేసులు తట్టుకోలేక ఆయన దేశం వదిలిపారిపోయారు. కైలాస అనే దీవిలో నివాసం ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ప్రియా ఆనంద్‌ తెలుగులో రానాతో లీడర్‌ చిత్రం తర్వాత రామ రామ కృష్ణకృష్ణ,180, కో అంటే కోటి సినిమాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాలన్నీ పరాజయం చెందాయి.దీంతో తెలుగులో ఆమెని పట్టించుకోవడం మానేశారు. ఆమె సైతం తమిళంకే పరిమితమయ్యింది. తమిళం, కన్నడ, మలయాళంలో నటిస్తూ బిజీగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement