Saturday, April 27, 2024

నెల్లూరులో ఎన్‌ఐఏ సోదాలు.. మావోయిస్టుల‌కు ఫండ్స్​ స‌మ‌కూర్చే అంశం..

నెల్లూరు (క్రైం), (ప్రభ న్యూస్‌) : నెల్లూరు నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శనివారం సోదాలు నిర్వహించినట్లు సమాచారం. మావోయిస్టులకు కొంతమంది నిధులు సమకూరుస్తున్నారని బిహార్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఎన్‌ఐఏ అధికారులు బిహార్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఏపీలోని 26 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.

ఇందులో భాగంగా నెల్లూరు బాలాజీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంజీనగర్‌లోని ఓ అపార్ట్‌ మెంట్‌లో నివాసముంటున్న ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌ పెంచలనాయుడు ఇంటికి ఎన్‌ఐఏ అధికారులు శనివారం చేరుకుని సోదాలు నిర్వహించారు. పెంచలనాయుడు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను విచారించి ఇంట్లో ఉన్న పలు పత్రాలను స్వాధీనపరుచుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసు అధికారులను వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement