Monday, April 29, 2024

పంజాబ్ ప్రభుత్వంపై ఎన్‎హెచ్‎ఆర్‎సీ సీరియస్..

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‎హెచ్‎ఆర్‎సీ) పంజాబ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో పంట వ్యర్థాల దహనం ఆపకపోతే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అదేవిధంగా పంటవ్యర్థాల దహనంపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ సీఎస్ కు ఎన్‎హెచ్‎ఆర్‎సీ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ తో పాటు హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వలన అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement