Friday, May 10, 2024

దేశ రాజధాని ఢిల్లీకి ‘చెడ్డ’ పేరు

దేశ రాజ‌ధాని ఢిల్లీ మ‌రో అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకుంది. వ‌ర‌ుస‌గా మూడో ఏడాది కూడా ప్ర‌పంచంలో అత్యంత క‌లుషిత రాజధానిగా నిలిచింది. గ‌త ఏడాది లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో కాలుష్య స్థాయి గ‌ణ‌నీయంగా త‌గ్గినా.. మ‌న న‌గ‌రాలు మాత్రం ఇంకా కాలుష్యంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ప్ర‌పంచంలోని టాప్ 30 న‌గ‌రాల్లో 22 ఇండియా నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని 2020 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వెల్ల‌డించింది. 2018, 2019 సంవత్సరాలతో పోలిస్తే కాలుష్యం త‌గ్గినా.. మిగ‌తా ప్ర‌పంచ న‌గ‌రాల‌తో పోలిస్తే ఇండియాలోని న‌గ‌రాలే కాలుష్యానికి కేరాఫ్‌గా నిలుస్తున్న‌ట్లు ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. 106 దేశాల్లోని ప్ర‌భుత్వాలు, ఇత‌ర ప్రైవేటు సంస్థ‌లు సేక‌రించిన పీఎం 2.5 డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఇక ప్ర‌పంచంలో అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ద‌క్షిణాసియానే టాప్‌లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement