Wednesday, May 15, 2024

Big Breaking: ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు… బెంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​కు చాన్స్​

ఎన్​డీఏ తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఇవ్వాల (శనివారం) ప్రకటించింది. పశ్చిమ బెంగాల్​ గవర్నర్​గా ఉన్న జగదీప్​ ధన్​కర్​కు చాన్స్​ ఇచ్చింది. ఈమేరకు ఈ ప్రకటను వెలువరించారు బీజేపీ పెద్దలు. కాగా, మొన్న అసోంలో బెంగాల్​ సీఎం మమత, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బెంగాల్​ గవర్నర్​ జగదీప్​ ప్రత్యేక భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే మమత దీనిపై ఎట్లాంటి ఇంపార్టెన్స్​ లేదని చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇవ్వాల బీజేపీ ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ముందస్తు చర్చలు జరిపారన్నది స్పష్టం అవుతోందంటున్నారు పొలిటికల్​ అనలిస్టులు.

అయితే.. బెంగాల్​ సీఎం మమతకు, గవర్నర్​ జగదీప్​కు అస్సలు పడేది కాదు. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలతో సీఎం మమత సొంత నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణలున్నాయి. వీరిద్దరి వివాదంపై కేంద్రానికి చాలాసార్లు ఫిర్యాదులు కూడా అందాయి. కాగా, అస్సాంలో వీరి భేటీ కావడంపై ఏదో జరుగుతోందని, బీజేపీతో మమత ఫ్యూచర్​ ప్లాన్​ చేస్తోందన్న విమర్శలు కూడా వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement