ఎన్డీఏ తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఇవ్వాల (శనివారం) ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్న జగదీప్ ధన్కర్కు చాన్స్ ఇచ్చింది. ఈమేరకు ఈ ప్రకటను వెలువరించారు బీజేపీ పెద్దలు. కాగా, మొన్న అసోంలో బెంగాల్ సీఎం మమత, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బెంగాల్ గవర్నర్ జగదీప్ ప్రత్యేక భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే మమత దీనిపై ఎట్లాంటి ఇంపార్టెన్స్ లేదని చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇవ్వాల బీజేపీ ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ముందస్తు చర్చలు జరిపారన్నది స్పష్టం అవుతోందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.
అయితే.. బెంగాల్ సీఎం మమతకు, గవర్నర్ జగదీప్కు అస్సలు పడేది కాదు. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలతో సీఎం మమత సొంత నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణలున్నాయి. వీరిద్దరి వివాదంపై కేంద్రానికి చాలాసార్లు ఫిర్యాదులు కూడా అందాయి. కాగా, అస్సాంలో వీరి భేటీ కావడంపై ఏదో జరుగుతోందని, బీజేపీతో మమత ఫ్యూచర్ ప్లాన్ చేస్తోందన్న విమర్శలు కూడా వచ్చాయి.