Sunday, April 28, 2024

బైజూస్ సంస్థ సీఈవో రవీంద్రన్ కి ఎన్సీపీసీఆర్ సమన్లు.. 23న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

తమకోర్సు మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు పేరెంట్స్..చిన్నారులపై వత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో బైజూస్ సంస్థ సీఈవో ర‌వీంద్ర‌న్‌కు ఎన్సీపీసీఆర్ స‌మ‌న్లు జారీ చేసింది. ఓ వార్తాప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం ఆధారంగా ఈ స‌మ‌న్లు జారీ చేసిన‌ట్లు ఎన్సీపీసీఆర్ పేర్కొంది. బైజూస్ త‌మ‌ను బెదిరించి, మోసం చేసి పిల్ల‌ల కోర్సు మెటీరియ‌ల్‌ను అమ్ముతున్న‌ట్లు ఆ క‌థ‌నంలో ఆరోప‌ణ‌లు చేశారు. రుణ ఒప్పందం కుదుర్చుకుని పేరెంట్స్‌ను ఇబ్బందిపెడుతున్న‌ట్లు బైజూస్‌పై ఫిర్యాదులు అందాయి. బైజూస్‌లో జ‌రుగుతున్న అక్ర‌మాల గురించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని, నేరుగా త‌మ విచార‌ణ క‌మిటీ ముందు హాజ‌రుకావాల‌ని ఎన్సీపీసీఆర్ త‌న నోటీసుల్లో పేర్కొన్న‌ది. 23వ తేదీన ర‌వీంద్ర‌న్ విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement