Wednesday, May 1, 2024

రూ.120కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన ఎన్సీబీ అధికారులు-ఆరుగురి అరెస్ట్

ఎన్సీబీ అధికారులు రూ.120కోట్ల విలువైన డ్రగ్స్ ని సీజ్ చేశారు. మ‌హారాష్ట్ర‌..గుజ‌రాత్ రాష్ట్రాల నుండి ఈ డ్రగ్స్ ని సీజ్ చేశారు.ఈ దాడుల్లో ఆరుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురిలో ఎయిరిండియాకు చెందిన మాజీ పైలెట్ కూడా ఉన్నారు. గుజరాత్ లోని ఇంటలిజెన్స్ యూనిట్ ఇచ్చిన నిర్ధిష్ట సమాచారం.. ఈ విషయాన్ని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ చెప్పారు. పక్కా సమాచారం ఆధారంగా ఢిల్లీలోని ఎన్సీబీ ప్రధాన కార్యాలయం ముంబై జోనల్ యూనిట్ అధికారులు ఈ నెల 3 వతేదీన జామ్ నగర్ లో దాడులు చేశారు. 10కిలోల మెఫిడ్రొన్ ను స్వాధీనం చేసుకున్నారు. జామ్ నగర్ లో ఒకరిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిని ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. గురువారం నాడు ఎన్సీబీ అధికారులు దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో ఎస్ బీ రోడ్ లో ఉన్న గోడౌన్ పై దాడిచేసి 50 మెఫిడ్రిన్ ను స్వాదీనం చేసుకున్నారని ఎన్సీబీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement