Sunday, April 28, 2024

హైద‌రాబాద్..ఢిల్లీ..పంజాబ్ లోని ప‌లు ప్ర‌దేశాల్లో ఈడీ దాడులు

హైద‌రాబాద్..ఢిల్లీ..పంజాబ్ లోని ప‌లు ప్ర‌దేశాల్లో ఈడీ దాడులు చేసింది.లిక్క‌ర్ స్కామ్ కేసులో వేగం పెంచింది ఈడీ. ఈ రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సరఫరా గొలుసు నెట్‌వర్క్‌లకు సంబంధించిన వారికి చెందిన‌ ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారుల బృందాలు త‌మ ప్రధాన కార్యాలయం నుంచి ఈ తెల్ల‌వారుజామునే నిర్దేశిత స్థానాలకు బయలుదేరాయి. కాగా, ఈ దాడుల‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై మ‌రోసారి విరుచుకుపడ్డారు. వీటిని “డర్టీ పాలిటిక్స్” అని విమ‌ర్శించారు. మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను కనుగొనాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో మూడు నెలల నుంచి 500 కంటే ఎక్కువ దాడులు, 300 పైచిలుకు మంది సీబీఐ/ఈడీ అధికారులు 24 గంటలూ పనిచేస్తున్నారు. కానీ, ఇప్ప‌టిదాకా ఏదీ క‌నుగోన‌లేక‌పోయారు. ఎందుకంటే అక్క‌డ ఏ త‌ప్పూ జ‌ర‌గ‌లేదు. ఇంత మంది అధికారుల సమయాన్ని త‌మ‌ నీచ రాజకీయాల కోసం వృథా చేస్తున్నారు. ఇలాంటి దేశం ఎలా పురోగమిస్తుంద‌ని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement