Sunday, May 5, 2024

Breaking: ఫార్మసీ ముసుగులో డ్రగ్స్‌ దందా

ఫార్మసీ ముసుగులో మత్తుమందు దందా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్‌ పెడ్లర్‌ను నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇంటర్‌నెట్‌ ఫార్మసీ, జేఆర్‌ ఇన్ఫినిటీ పేరుతో వ్యాపారం చేస్తున్న ఆశీష్‌ జైన్‌ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ లభించిన రూ.3.71 కోట్ల నగదను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నెట్‌ ఫార్మసీ ముసుగులో అమెరికాతోపాటు విదేశాలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గత రెండేండ్లలో వెయ్యికి పైగా డ్రగ్స్‌ ఆర్డర్లను పంపినట్లు తెలుస్తోంది. బిట్‌ కాయిన్స్‌, క్రొప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు నిర్వహించినట్లు నిర్ధారించారు. డ్రగ్స్‌ సంబంధించి ఆశీష్‌ నుంచి కీలక సమాచారాన్ని ఎన్సీబీ సేకరించినట్లు తెలుస్తున్నది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement