Thursday, April 25, 2024

ఘటన ఏదైనా మతం రంగు: దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతకల్లోలాలు సృష్టించడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎలాంటి ఘటనలు జరిగినా మతం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. సరూర్ నగర్ ఘటన దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై బురదచల్లేందుకే బీజేపీ నేతలు గవర్నర్ దగ్గరకు వెళ్లారని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఎలాంటి పక్షపాతం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement