Monday, April 29, 2024

పోలీసుల‌పై ‘న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ’ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు – క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్

పోలీసుల‌పై పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ త‌ప్పుడు ప‌ద‌జాలాన్ని వాడ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని బిజెపి విమ‌ర్శించింది. త‌మ ఎమ్మెల్యేలు త‌ల‌చుకుంటే పోలీసుల ప్యాంట్లు కూడా త‌డిసిపోయేలా చేయ‌గ‌ల‌ర‌ని సిద్ధూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సుల్తాన్ పూర్ లోధిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ వ్యాఖ్యలపై పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సీనియర్ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని… ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.

చండీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చందేల్ మాట్లాడుతూ… సిద్ధూ కుటుంబాన్ని రక్షిస్తున్నది కూడా పోలీసులేనని చెప్పారు. ఆయనకు పరువునష్టం నోటీసులు పంపించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ నేత దల్జీత్ సింగ్ కూడా సిద్ధూపై మండిపడ్డారు. ప్రజల కోసం శ్రమించే పోలీసులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని… వారికి సిద్ధూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement