Wednesday, May 1, 2024

నిర్మాత‌గా మారిన న‌టి క‌ల్యాణి

శేషు మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది న‌టి క‌ల్యాణి. అనంత‌రం డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ ని వివాహం చేసుకుంది. . ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీలో నటించిన కల్యాణి ఉత్తమ నంది అవార్డు అందుకుంది. జగపతి బాబు, వెంకటేష్ లతో ఎన్నో సినిమాల్లో చేసింది. ముఖ్యంగా జగపతి బాబుతో పలు సినిమాల్లో చేసి, బెస్ట్ ఫెయిర్ గా గుర్తింపు పొందారు. పెళ్లయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. లక్ష్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో కావేరిగా పాపులర్ అయింది. అందుకే కళ్యాణి కావేరిగా మార్చుకుంది.ఆ తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు పొందిన కళ్యాణి తల్లిగా, వదినగా కూడా నటించింది. అయితే మళ్ళీ సినిమాలకు దూరమై ఇప్పుడు డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. చేతన్ శ్రీను అనే హీరోని పరిచయం చేయబోతోంది. గతంలో కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. తాజాగా మెగాఫోన్ పట్టబోతున్నారు కళ్యాణి. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కళ్యాణి నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఇంకా సినిమాకి టైటిల్ ని ఖరారు చేయలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement