Monday, April 29, 2024

ల‌తా దీదీ మ‌ర‌ణంతో చెప్ప‌లేని ఆవేద‌న‌లో ఉన్నా – ప్ర‌ధాని మోడీ ట్వీట్

తాను చెప్ప‌లేని ఆవేద‌న‌లో ఉన్నాన‌ని, ల‌తా దీదీ మ‌మ్మ‌ల్ని వ‌దిలిపెట్టార‌ని..ఆమె మ‌ర‌ణం దేశానికి తీర‌ని శున్నాన్ని మిగిల్చింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాబోయే తరాలు భారతీయ సంస్కృతికి ధీటుగా ఆమెను గుర్తుంచుకుంటారని చెప్పారు. లతా దీదీ పాటలు.. రకరకాల ఎమోషన్లను తీసుకోచ్చాయని.. ఆమె దశాబ్దాలుగా భారతీయ చలన చిత్ర ప్రపంచ మార్పులను దగ్గరగా చూసిందని అన్నారు. సినిమాలకు అతీతంగా, ఆమె భారతదేశ ఎదుగుదల పట్ల ఎప్పుడూ మక్కువ చూపేది.

ఆమె ఎల్లప్పుడూ బలమైన , అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుందని ప్రధాని మోడీ అన్నారు. లతా దీదీ నుంచి నెను ఎప్పుడూ.. అపారమైన ప్రేమను పొందానని అది గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. లతా దీదీ మరణించినందుకు నా తోటి భారతీయులతో నేను బాధపడ్డాను. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఓం శాంతి అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.ప్రముఖ గాయని.. భారతరత్న, పద్మ విభూషన్ లతా మంగేష్కర్ మరణించడం పట్ల దేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement