Sunday, May 5, 2024

నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో.. 9మంది ఖైదీలకు కరోనా..

దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రాల వారీగా కూడా గత వారం పది రోజులుగా కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా.. మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో కరోనా కలకలం సృష్టిస్తున్నది. జైలులో ఇప్పటి వరకు తొమ్మిదిమంది ఖైదీలు వైరస్‌ బారినపడ్డారు. నాలుగు రోజుల క్రితం 12 మంది ఖైదీల్లో కరోనా లక్షణాలు కనిపించాయని, వారికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి మరో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరిందని వెల్లడించారు. పాజిటివ్‌లుగా నిర్ధారణ అయినవారిని ఐసోలేషన్‌కు తలించామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement