Monday, April 29, 2024

ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది: వైరల్ గా మారిన నాగబాబు ట్వీట్

మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ ఆయన పెట్టిన ఈ పోస్టు అభిమానుల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. “ ఇన్నాళ్ల నాజీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసి, ఎన్నో విపత్తులు ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒకరకంగా చూస్తే ఆ ఆపదలు, కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సాహాయపడ్డాయి. నేడు పుట్టి పెరిగిన నా దేశానికి, నా తోటి ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకుని అదే గమ్యంగా నా లక్ష్యంవైపు పయనించాను. ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా కానీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించటానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా.. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది” అంటూ నాగబాబు పోస్టు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement