Wednesday, April 17, 2024

Covid-19: భారత్ లో కరోనా ఖేల్ ఖతం.. కొత్తగా 3 వేల కేసులు

దేశంలో కరోనా మహమ్మారి దాదాపు పూర్తిగా అదుపులోకి వస్తోంది. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3116 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,90,991కు చేరింది. దేశంలో 47 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,15,850కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,559 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,24,37,072 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 38,069 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 89.11 శాతంగా ఉంది.  ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,13,23,547 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement