Saturday, May 4, 2024

MPTC, ZPTC Elections: పరిషత్ ఎన్నికల పోలింగ్ షురూ

ఏపీలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల‌కు పోలింగ్ ప్రారంభం అయింది.  ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ది.  మొత్తం 8 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోబోతున్నారు.  గ‌తంలో వివిధ కార‌ణాల‌తో ఎన్నిక‌లు నిలిచిపోయిన స్థానాల్లో ఇప్పుడు పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు.  ఈ ఎన్నిక‌ల పోలింగ్ కోసం 954 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 జెడ్పీటీసీ స్థానాల్లో 40 అభ్య‌ర్థులు పోటీ ప‌డుతుండ‌గా.. 123 ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.  

ఈనెల 18వ తేదీన ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది. గుంటూరు జిల్లాలో 1 జెడ్పీటీసీ, 11 ఎంపీటీసీ స్థానాల‌కు పోలింగ్ జరుగుతుండ‌గా, అనంత‌పురంలో 1 జెడ్పీటీసీ, 10 ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు.  తూర్పుగోదావ‌రి జిల్లాలో 21 ఎంపీటీసీ స్థానాల‌కు, విశాఖ జిల్లాలో 1 జెడ్పీటీసీ, 6 ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.  కాగా, మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్‌ జారీచేసింది. వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement