Friday, March 15, 2024

కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన‌ మోత్కుపల్లి న‌ర్సింహులు

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి, బషీర్ బాగ్ లో బాబూ జగ్జివన్ రావు విగ్ర‌హానికి, అనంతరం గన్ పార్కు లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. త‌ర్వాత తెలంగాణ భవన్ కు బయల్దేరిన ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. అయితే మోత్కుపల్లి నర్సింహులుకు ఓ కీలక పదవి కూడా ఇచ్చే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement