Friday, May 10, 2024

మోడీజీ, ఎన్నిసార్లు మోసం చేస్తారు?.. అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించామ‌న్నారు క‌దా!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోడీపై రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్‌ చేస్తారని ట్విటర్‌ వేదికగా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్మూ సొంత గ్రామానికి విద్యుత్‌ సదుపాయం కల్పించిన వార్తా కథనాన్ని జోడిస్తూ కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అబద్దాలు… అబద్దాలు… బాజపా మార్క్‌ అబద్దాలు అంటూ దుయ్యబట్టారు. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించినట్టు 2018 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీ రామారావు గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ గ్రామానికి మాత్రం ఆమె నామినేషన్‌ దాఖలు చేశాక 2022 జూన్‌ 25న విద్యుత్‌ సదుపాయం కల్పించారని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement