Sunday, May 5, 2024

స్టేషన్ ఘనపూర్ లో వేడెక్కిన రాజకీయం

స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య వార్ ముదురుతోంది. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. తనకు నియోజకవర్గంలో వస్తున్న ప్రజాదరణ చూసి కడియం ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. తనపై కడియం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇదంతా పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని, తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని సూచించారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించొద్దని రాజయ్య  కోరారు.

కాగా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు చాలా మాట్లాడుతాడని.. చెల్లని రూపాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా… పదవి ఇప్పిస్తాననో… పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement