Sunday, April 28, 2024

బోనాల‌ మ‌హోత్స‌వాల‌కు సీఎం కేసీఆర్ ని ఆహ్వానించిన – మంత్రి త‌ల‌సాని

మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ..సీఎం కేసీఆర్ ని సికింద్రాబాద్ ప‌రిధిలో శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళీ దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో జ‌రిగే బోనాల మ‌హోత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఆహ్వానించారు. ఈ మేర‌కు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ నేతృత్వంలో ఆల‌య కమిటీ చైర్మ‌న్ సూరిటి కామేశ్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డిలు కేసీఆర్‌కు ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు.
ఈ నెల 17,18 తేదీల్లో మ‌హంకాళి బోనాల ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, ఈ ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఈ సందర్భంగా ఆల‌య క‌మిటీ కేసీఆర్‌ను కోరింది. తెలంగాణ వ్యాప్తంగా అట్ట‌హాసంగా జ‌రిగే బోనాల ఉత్స‌వాల్లో మ‌హంకాళీ అమ్మ‌వారి బోనాలకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement