Wednesday, May 8, 2024

సీఎం కేసిఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాల కోసం మృత్యుంజయ హోమం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ… రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబ సభ్యులతో మృత్యుంజయ హోమం నిర్వహించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల హఠాత్తుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో ఆయన అనారోగ్య పరిస్థితిపై తీవ్ర కలత చెందిన మంత్రి సత్యవతి రాథోడ్.. సిఎం కేసిఆర్ ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగుతూ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ ఈ మృత్యుంజయ హోమం జరిపారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన మృత్యుంజయ హోమం పూర్ణాహుతికి రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement