Saturday, April 27, 2024

మంత్రి రోజాకు సన్మానం చేయాలి: బండ్ల గణేష్

ఏపీ మంత్రి రోజాపై టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజాకు సన్మానం చేయాలని వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా గురించి బండ్ల గణేష్ చాలా అభిమానంగా మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఆమెకు సినీ పరిశ్రమ తరపున సన్మానం చేయాలని అన్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు ఓడిపోయి, రెండు సార్లు గెలిచిన రోజాకు మంత్రి పదవి రావడం సంతోషకర విషయమని చెప్పారు. రోజాను మంత్రిగా చూడటం ఆనందాన్ని కలిగిస్తోందన్న బండ్ల గణేష్.. ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement