Thursday, May 9, 2024

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌-ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌

నేడు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు మంత్రి కేటీఆర్. మొదట దేవరకద్ర నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొన్న అనంతరం కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ హాజరుకానున్నారు. ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములుతోపాటు జెడ్పీ చైర్‌పర్సన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. భూత్పూర్‌ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌ (సిద్దాయపల్లి) వద్ద కేటీఆర్‌ చేతుల మీదుగా ఒకేచోట 288 డబుల్‌ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. హెలిక్యాప్టర్‌ ద్వారా వస్తున్న మంత్రులు మొదట దేవరకద్ర నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగసభలో పాల్గొని అనంతరం కోస్గి పట్టణానికి వెళ్లనున్నారు. కేటీఆర్‌ పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement