Thursday, May 2, 2024

ఖమ్మంలో పర్యటించనున్న మంత్రి కేటిఆర్..

మంత్రి కేటిఆర్ ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ నెల 16న మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో పలు అభవృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, పువ్వాడ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 16న ఉదయం 9.00 హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 10.00గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 10.15 గంటలకు రఘునాథపాలెం పల్లె బృహత్ ప్రకృతి వనం (Suda) పార్క్ ప్రారంభిస్తారు. 10.45 గంటలకు ఖమ్మం టేకులపల్లి KCR టవర్స్ వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు.

తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఫుట్ పాత్ ను ప్రారంభిస్తారు. అనంతరం నూతన మున్సిపల్ భవనం ప్రారంభోత్సవం చేస్తారు. చెత్త సేకరణ నిమిత్తం మున్సిపల్ కార్యాలయంకు మంజూరైన ట్రాక్టర్లు (10), ఆటోలు (15) ను ప్రారంభిస్తారు. ప్రకాశ్ నగర్ లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామంను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement