Sunday, April 28, 2024

Telangana: తాత కేశ‌వ‌రావుతో కలిసి దిగిన‌ మరో అరుదైన ఫొటో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ తన తాతయ్య జె.కేశవరావుతో దిగిన‌ ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోల్లో చిన్నప్పడు త‌ను ఎలా ఉండేదో తెలియ‌జేశారు. కాగా, తాను ఎదిగిన తర్వాత తాత కేశవరావుతో కలిసి దిగిన మ‌రో ఫొటోను కూడా కేటీఆర్ తాజాగా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎప్పుడూ చలాకీగా ఉండే మా తాతయ్య జోగినపల్లి కేశవరావుతో మరో ఫొటో అంటూ ట్వీట్ చేశారు. ఆయనకు తానే మొదటి మనవ‌డిన‌ని, అందుకే తనపై ప్రత్యేకంగా ఆపేక్ష చూపించేవారని కేటీఆర్ వెల్లడించారు.

ఇక‌.. మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఈ ఫొటోలపై తెలంగాణ బీజేపీ ‘మెదడుకు మేత’ అంటూ స్పందించింది. తన తాతయ్య కేశవరావు గురించి కేటీఆర్ చెప్పిందంతా నిజమే అయితే ఆయనకు తాము సెల్యూట్ చేస్తున్నామని పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement