Sunday, May 5, 2024

రూ.50కే చీప్‌ లిక్కర్‌.. వావ్ వాట్ ఏ స్కీమ్: సోముపై కేటీఆర్ సెటైర్

ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్‌ లిక్కర్‌ రూ.50కే ఇస్తామంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా సోము కామెంట్స్ పై తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైర్‌లు వేశారు.

సోము వీర్రాజు మాట్లాడిన వీడియోను ట్వట్టర్‌లో పోస్టు చేశారు. ‘వాహ్‌.. ఏం పథకం.. ఎంత అవమానకరం. ఏపీ బీజేపీ పతనానికి చేరింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనే బీజేపీ జాతీయ విధానామా? లేదా బీజేపీ నిరాశలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

కాగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రజాగ్రహ సభలో మద్యం ధరలపై సోము వీర్రాజు మాట్లాడారు. ఏపీలో మద్యం ధరలు మండిపోతున్నాయని, బీజేపీ అధికారంలోకి వస్తే అతి తక్కువ ధరలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మద్యం ధరలు తగ్గించి యాభై రూపాయలకే చీప్ లిక్కర్ అందిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement