న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. భారత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో ఉన్న అభివృద్ధి అవకాశాలపై కేంద్ర మంత్రితో కేటీఆర్ చర్చించారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, సురేశ్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.
Breaking: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో మంత్రి కేటీఆర్ భేటీ.. మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలపై చర్చ..
Advertisement
తాజా వార్తలు
Advertisement